తెలంగాణకు వ్యతిరేకం కాదు, జగన్‌పై సిఎం విమర్శలు

Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణకు కాంగ్రెసు పార్టీ వ్యతిరేకం కాదని అయితే తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉన్నందున నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధులకు సూచించారు. రూ.1కి కిలో బియ్యం ప్రకటించిన సిఎంను అభినందించడానికి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెసు కార్యకర్తలు సోమవారం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను ఎప్పుడూ కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపలేదన్నారు. కళ్లముందు కనిపిస్తున్న దానిని కప్పిపుచ్చి తప్పుడు నివేదికలు ఎలా పంపిస్తానని తెలంగాణ కాంగ్రెసు నేతలను ప్రశ్నించారు. పత్రికలలో వచ్చిన కథనాలను బట్టి తనను అనుమానించడం శోచనీయమన్నారు. మన పార్టీ నేతలే నన్ను అనుమానించడం సరికాదన్నారు.

ఇతర పార్టీలకు టీవీలు, పేపర్లు ఉన్నాయని కానీ కాంగ్రెసు పార్టీకి ప్రజలు ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ప్రజా మద్దతు ఉండటం వల్లనే కాంగ్రెసు 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందిందన్నారు. ప్రజలను ఇబ్బందులు పెట్టే సకల జనుల సమ్మె సరికాదన్నారు. సమ్మెను విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 14ఎఫ్ రద్దుకు తాను ఏవిధంగా కృషి చేశానో అందరికీ తెలుసన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకే తాను రూ.1కి బియ్యం ప్రకటించానన్నారు. ఈ నిర్ణయంతో కొందరిలో బాధ కలుగుతోందని, మరికొందరు అసాధ్యమంటున్నారని జగన్, చంద్రబాబులను ఉద్దేశించి అన్నారు. రైతులకు కాంగ్రెసు అండగా ఉంటోందన్నారు. ఒకేరోజు లక్షమంది ఉద్యోగాలు త్వరలో పూర్తి చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+