సిఎం నియోజకవర్గంలో మావోల మందుపాతరలు

Kirankumar Reddy
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో మావోయిస్టులు మందుపాతరలు అమర్చారు. జిల్లాలోని ఎర్రవారిపాలెం మండలం బొంతకనుమ వద్ద పోలీసులు మూడు మందుపాతరలను కనిపెట్టారు. బొంత కనుమ అంతా దట్టమైన అటవీ ప్రాంతం. మావోయిస్టులు అమర్చిన మందుపాతరల్లో ఒకటి పేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

బాంబ్ స్క్కాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. తనిఖీల్లో మూడు మందుపాతరలు బయటపడ్డాయి. మరిన్ని మందుపాతరలు ఉండవచ్చునేమోనని అనుమానిస్తున్నారు. దీంతో విస్తృతంగా తనిఖీలు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలోనే ఉన్నారు. అయితే, మావోయిస్టులు ఆ మందుపాతరలను ఐదేళ్ల క్రితం అమర్చి ఉంటారని వార్తలు వస్తున్నాయి. మందుపాతరల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+