దొంగ వేషాలతో అల్లుడు బాబు వస్తున్నాడు: లక్ష్మీపార్వతి

లక్షలాది మంది రైతుల గుండెల్లో వైయస్ రాజశేఖర రెడ్డి నిలిచిపోయారని, ఆ నాయకుడు మరణించిన తర్వాత ఈ ప్రభుత్వం, కాంగ్రెసు ఏం చేస్తున్నాయో చూస్తున్నామని ఆమె అన్నారు. వైయస్సార్, ఎన్టీ రామారావుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని వైయస్ జగన్ వచ్చారని ఆమె అన్నారు. రైతులు వీధుల్లోకి వస్తుంటే ఏం చేయలేని చేతగాని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిలిచిపోయారని వైయస్సార్ కాంగ్రెసు అధికార ప్రతినిధి రోజా అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండుగ అన్నారని, ఈ రోజు కాంగ్రెసు ప్రభుత్వాన్ని కాపాడడానికి చంద్రాబబు పనిచేస్తున్నారని ఆమె అన్నారు. రైతు బాంధవుడు వైయస్సార్ వారసుడు వైయస్ జగన్ ప్రజల ముందుకు వస్తున్నారని ఆమె అన్నారు.
జగన్ దీక్షను భగ్నం చేయడానికి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ప్రయత్నించడం సిగ్గుచేటు అని ఆమె అన్నారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు 32 మంది ఉన్నా రాష్ట్రానికి ఏమీ చేయడం లేదని ఆమె అన్నారు. రైతుల కోసం పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వైయస్ జగన్ను దెబ్బ తీయడమే ప్రధాన లక్ష్యంగా ఉందని ఆమె అన్నారు. రైతులను మోసం చేసిన చంద్రబాబుకు పట్టిన గతి కాంగ్రెసు పార్టీకి పడుతుందని ఆమె అన్నారు. రైతులకు అన్ని సౌకర్యాలు కలగాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆమె అన్నారు. జగన్ త్వరలో ముఖ్యమంత్రి అవుతారని, ప్రజల కష్టాలు తొలగిపోతాయని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications