ఢిల్లీ పర్యటనలో పురోగతి కనిపించింది: కోదండరామ్

సింగరేణి కార్మికులకు దసరా ఆడ్వాన్సులు చెల్లించేందుకు సింగరేణి సిఎండి ఒప్పుకున్నందు వలన చెన్నూరు శాసనసభ్యుడు నల్లాల ఓదేలు మంగళవారం సాయంత్రం తన దీక్షను విరమించారు. సింగరేణి కార్మికులకు అడ్వాన్సులు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ సిఎండిని కలిసి అభ్యర్థించారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో ఓదేలు రెండు రోజులుగా చేస్తున్న తన దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ తెలంగాణ ఇప్పుడు రాకపోతే మరెప్పుడూ రాదన్నారు. రాష్ట్రం కోసం ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications