తెలంగాణ పరిస్థితిని అదుపు చేస్తాం: డిజిపి

Dinesh Reddy
తిరుమల/ విజయవాడ: తెలంగాణ పరిస్థితిని అదుపు చేస్తామని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) దినేష్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో పరిస్థితులను అదుపు చేయడానికి ఇప్పటికే కేంద్ర బలగాలు వచ్చాయని, అవసమైతే మరిన్ని బలగాలను కోరుతామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తెలంగాణ జెఎసి ఈ నెల 9,10,11 తేదీల్లో తలపెట్టిన రైల్ రోకోను అడ్డుకుంటామని ఆయన చెప్పారు. రైళ్లను నడిపించడానికి అదనపు భద్రత కల్పిస్తామని ఆయన చెప్పారు. ప్రజలకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని ఆయన అన్నారు.

కాగా, రైల్ రోకో కార్యక్రమాన్ని విరమించుకోవాలని ఆంధ్ర జెఎసి తెలంగాణ జెఎసిని కోరింది. రైల్ రోకోను నిరసిస్తూ 72 గంటల పాటు దీక్ష చేయనున్నట్లు ఆంధ్ర జెఎసి కన్వీనర్ సుంకర కృష్ణమూర్తి శుక్రవారం చెప్పారు. సెలవులకు ఇళ్లకు వెళ్లినవారు తిరిగి వస్తున్న సమయంలో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసి తలపెట్టిన రైల్ రోకోను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+