రైల్ రోకోపై ప్రభుత్వానికి హరీష్ రావు హెచ్చరిక

రైల్ రోకోను విజయవంతం చేయడానికి అవసరమైతే తాము ఆరంచెల విధానాన్ని అనుసరిస్తామని ఆయన అన్నారు. ఈసారి రైల్ రోకోలో అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొంటారని ఆయన చెప్పారు. రైల్ రోకోను అడ్డుకుంటే తొమ్మిదో జాతీయ రహదారిపై ఇటీవల నెలకొన్న పరిస్థితులు నెలకొంటాయని ఆయన అన్నారు. రైలు పట్టాలపై ఎడ్లబండ్లను, వాహనాలను తరలించి రైళ్లను అడ్డుకుంటామని ఆయన చెప్పారు. పోలీసులకు భయపడాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రజలను అరెస్టు చేస్తే జైలు భరో కార్యక్రమం చేపడతామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications