రాష్ట్రపతి పాలన పుకార్లపై నర్సింహన్ నో కామెంట్

ప్రభుత్వం బాగానే ఉందని ఆయన అన్నారు. తిరుమలలో చక్రస్నానం చేస్తూ అస్వస్థతకు గురైనట్లు వచ్చిన వార్తలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. సంచలనం సృష్టించడానికి అలాంటి వార్తలు రాయడం తనకు అసహ్యం కలిగిస్తుందని ఆయన అన్నారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తాను పూర్తి ఫిట్నెస్తో ఉన్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన శుక్రవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. శనివారం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కేంద్ర హోం మంత్రి పి. చిదంబరాలను కలుస్తారు.












Click it and Unblock the Notifications