తెలంగాణపై తెగేసి చెప్పిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Sabitha Indra Reddy
హైదరాబాద్: తెలంగాణ అంశంపై మౌనం వహిస్తూ వచ్చిన రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెగేసి మాట్లాడారు. తెలంగాణ అనుకూలంగా ఉద్వేగంగా మాట్లాడారు. బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ భలయ్ కార్యక్రమంలో ఆమె శుక్రవారం మాట్లాడారు. ఇంద్రారెడ్డి భార్యగా, తెలంగాణ బిడ్డగా తాను తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించలేనని ఆమె చెప్పారు. తెలంగాణ విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి తమకు కొన్ని పద్ధతులు, పరిమితులుంటాయని ఆమె అన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్ష తనకు తెలుసునని ఆమె చెప్పారు. తాము అన్ని విషయాలను తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి తెలియజేస్తూనే ఉన్నామని ఆమె అన్నారు. ప్రభుత్వం నుంచి బయటకు రావాల్సి వచ్చినప్పుడు తాము అందరం కలిసే నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసునని, పరిస్థితులు ఎలా ఉన్నా అందరం కలిసి పనిచేయాల్సి ఉంటుందని ఆమె అన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందినవారిగా తమ సమస్యలను, ప్రజల ఆకాంక్షను తమ పార్టీ అధిష్టానానికి తెలియజేస్తూనే ఉన్నామని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజలు దసరాను మొక్కుబడిగా చేసుకున్నారని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+