కాంగ్రెసు ఆఫీసులో తెలంగాణ లొల్లి, గాల్లోకి కుర్చీలు

తెలంగాణకు ప్రత్యేక కమిటీ వేయకుంటే తెలంగాణ వచ్చాకే యువజన నమోదు కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పటంతో నమోదు కార్యక్రమాన్ని మూడు నెలలు వాయిదా వేశారు. అనంతరం తెలంగాణ కాంగ్రెసు కార్యకర్తలు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు సరికాదన్నారు. నమోదు చేస్తే తెలంగాణ ద్రోహులుగా పరిగణిస్తామన్నారు. పోలీసులు మమ్మల్ని కార్యాలయం నుండి తరమడం సరికాదన్నారు. ఇలా అయితే తెలంగాణ వచ్చేకే సభ్యత్వ నమోదు జరిపిస్తామన్నారు. కాగా గాంధీ భవనంలోని గొడవపై పిసిసి చీఫ్ ఆరా తీశారు.












Click it and Unblock the Notifications