వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ జెఏసితో శతృత్వం లేదు: గద్దర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

gaddar
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితితో తమకు ఎలాంటి శతృత్వం లేదని తెలంగాణ ప్రజా ఫ్రంట్ చైర్మన్, ప్రజా యుద్ద నౌక గద్దర్ ఆదివారం అన్నారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ స్థాపించి సంవత్సరం పూర్తయినందున ఆయన గన్ పార్కులోని అమర వీరుల స్థూపం వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధ్యమని చెప్పారు. ఓట్లతో, మాటలతో తెలంగాణ రాదన్నారు.

ప్రజా ఫ్రంట్ చేసిన ఉద్యమాల ద్వారానే తెలంగాణపై కేంద్రంలో కదలిక వచ్చిందన్నారు. ఇక ముందు కూడా అదే స్థాయిలో ఉద్యమిస్తామని చెప్పారు. వచ్చే పార్లమెంటు సమావేశాలలో కేంద్రం తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితితో ఎలాంటి శతృత్వం లేదన్నారు. తెలంగాణ అంశంపై సంప్రదింపుల పేరుతో కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఈ నెల20 నుంచి ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పారు.

English summary
Telangana Praja Front Chairman Gaddar said today that they will not anti to Telangana Political JAC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X