వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ అంశం: అధిష్టానం ముందుకు చిరంజీవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
న్యూఢిల్లీ: తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఢిల్లీకి పిలిపించి అభిప్రాయాలు తెలుసుకున్న అధిష్టానం తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవిని ఢిల్లీ రావాల్సిందిగా ఇప్పటికే అహ్వానించిన విషయం తెలిసిందే. తెలంగాణపై చిరంజీవి అభిప్రాయం తెలుసుకునేందుకే ఆయనను ఢిల్లీ రమ్మన్నట్లుగా తెలుస్తోంది. సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావుకు కూడా అధిష్టానం నుండి పిలుపు వచ్చింది.

ఆదివారం సాయంత్రం హైదరాబాదు నుండి ఢిల్లీ బయలుదేరే చిరంజీవి రాత్రే కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాదుతో భేటీ అయ్యే అవకాశం ఉంది. సోమవారం ప్రణబ్ ముఖర్జీ, ఎకె ఆంటోనీ, చిదంబరంలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. వారితో భేటీలో తెలంగాణపై చిరు తన నిర్ణయం చెబుతారు. రాష్ట్రంలో ప్రధాన సమస్య అయిన తెలంగాణ అంశం విషయంలో చిరంజీవికి ప్రాధాన్యత ఇవ్వాలని భావించిన అధిష్టానం ఆయనను పిలిపించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు కావూరి సాంబశివ రావు ఢిల్లీ వెళ్లి చిరంజీవితో, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌తో సమావేశం కానున్నారు. ఆ తర్వాత ప్రణబ్‌తో భేటీ కానున్నారు.

English summary
Tirupati MLA Chiranjeevi will told his openion on Telangana issue to High Command.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X