తెలంగాణపై నిర్ణయానికి సమయం పడుతుంది: సిఎం
అందరి అభిప్రాయాలు ప్రతిబింబించే విధంగా నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, అన్ని కోణాల నుంచి ఆలోచించి కేంద్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరిస్తుందని ఆయన అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తే ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. ఆస్తులు ధ్వంసం చేస్తే చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఎంత పెద్దవారైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. హింసకు దిగితే సహించబోమని ఆయన అన్నారు.
ప్రైవేట్
విద్యాసంస్థలకు
ఆటంకం
కలిగిస్తే
కఠినమైన
చర్యలు
తీసుకుంటామని
ఆయన
చెప్పారు.
ప్రభుత్వ
ఉపాధ్యాయులు
విద్యార్థుల
భవిష్యత్తును
దృష్టిలో
పెట్టుకుని
సమ్మె
విరమించాలని
ఆయన
కోరారు.
పోటీ
పరీక్షలకు
ఆటంకం
కలిగించవద్దని
ఆయన
తెలంగాణ
ఆందోళనకారులకు
సూచించారు.
ఈ
ప్రాంత
ప్రజల
మనోభావాలను
మీరు
తెలియజేశారని,
ఆ
బాధ్యతను
నెరవేర్చారని,
ప్రజలకు
సేవలందించాల్సిన
బాధ్యతను
కూడా
గుర్తించాలని,
అందుకు
వెంటనే
సమ్మె
విరమించాలని
ఆయన
ప్రభుత్వోద్యోగులను
కోరారు.
తెలంగాణపై
భిన్నాభిప్రాయాలున్నాయని
అందరికీ
తెలుసునని,
దాని
జోలికి
తాను
వెళ్లడం
లేదని
ఆయన
ఒక
ప్రశ్నకు
సమాధానంగా
అన్నారు.
ప్రజల
ఆకాంక్షలకు
అనుగుణంగా
నిర్ణయం
ఉండాలని
కేంద్ర
ప్రభుత్వం
ప్రయత్నిస్తోందని
ఆయన
అన్నారు.