సైఫాబాద్లో టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్పై కేసు

తమపై కేసులు పెట్టడం శోచనీయమని ఉద్యోగ సంఘాల నేత స్వామి గౌడ్ ఇందిరాపార్కు వద్ద ఉద్యోగుల మహాధర్నా ప్రారంభానికి ముందు అన్నారు. పలువురు పోలీసులు తమ వద్దకు వచ్చి సమ్మెలో పాల్గొంటామని చెబితే శాంతిభద్రతల సమస్యలు వస్తాయని చెప్పి మేమే వద్దన్నామన్నారు. ఈ నేపథ్యంలో ముందు ముందు పోలీసులు కూడా సమ్మెలోకి రావచ్చు, కాబట్టి వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని ప్రభుత్వానికి సూచనలు చేసినందుకే తమపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఓ పక్క మాపై కేసులు పెడుతూనే మరోపక్క చర్చలు అంటూ ప్రభుత్వం కపట నాటకం ఆడుతోందన్నారు. సమ్మె నోటీసు ఇచ్చింది తెలంగాణ ఎన్ఎంయు కాబట్టి ఎన్ఎంయు చేసిన ప్రకటనకు అర్థం లేదన్నారు.












Click it and Unblock the Notifications