హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ సమస్యకు త్వరలో పరిష్కారం: శైలజానాథ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sailajanath
హైదరాబాద్: తెలంగాణ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని సమైక్యాంధ్రవాదాన్ని బలంగా వినిపిస్తున్న సీమాంధ్రకు చెందిన మంత్రి శైలజానాథ్ అన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు సమ్మె విరమించాలని ఆయన సూచించారు. కాస్తా ఓపిక పట్టాలని ఆయన సూచించారు. సమ్మె వల్ల ఇబ్బందులు పడుతున్నది తెలంగాణ ప్రజలేనని, అందువల్ల ఉద్యోగులు సమ్మెను విరమించడం మంచిదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించాలని తాము కేంద్రాన్ని కోరుతామని ఆయన అన్నారు.

తెలంగాణ సమస్యపై మంత్రివర్గ సమావేశంలో చర్చకు ఉండదని, అయితే మంత్రిగా ఆ సమస్యను త్వరగా పరిష్కరించాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన అన్నారు. సాధ్యం కాని డిమాండ్లు పెట్టి ఉద్యోగులు సమ్మెను కొనసాగించడం మంచిది కాదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులతో తమ చర్చలు విఫలం కావడం విచారకరమని ఆయన అన్నారు. రైల్ రోకో సందర్భంగా అరెస్టయినవారిపై చట్టప్రకారం చర్యలుంటాయని ఆయన చెప్పారు.

English summary
Minister from Seemandhra Sailajanath said that Telangana issue will be resolved soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X