వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీలపై కక్ష సాధింపు: సిఎం, మంత్రులపై వివేక్ ధ్వజం

By Srinivas
|
Google Oneindia TeluguNews

vivek
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ మంత్రులపై పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ ఆదివారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెసును భూస్థాపితం చేసే లక్ష్యంతో కిరణ్ వెళుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెసును కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైనే ఉందన్నారు. పార్లమెంటు సభ్యుల అరెస్టుపై తెలంగాణ మంత్రులు స్పందించక పోవడం సిగ్గు చేటన్నారు.

మంత్రులు ఇప్పటికైనా రాజీనామా చేసి తెలంగాణపై తమ చిత్తశుద్ధి ిరూపించుకోవాలన్నారు. మంత్రి జానారెడ్డి సకల జనుల సమ్మె విరమించాలని కోరటం బాధాకరమన్నారు. తెలంగాణ వచ్చేదాకా సమ్మె కొనసాగిస్తామన్నారు. అరెస్టులు, కేసులకు భయపడి వెనుకడుగు వేసేది లేదన్నారు. ఉద్యమకారులను కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ మంత్రులపై ఉందన్నారు.

English summary
Peddapalli MP Vivek lashes out at CM Kiran Kumar Reddy and TGelangana ministers today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X