బాన్సువాడ ఉప ఎన్నిక: కాంగ్రెసుకు సెటిలర్ల అండ?

బాన్సువాడ నియోజకవర్గంలోని ఓటర్లలో సీమాంధ్ర సెటిలర్లు, మైనారిటీలు కలిపి 35 వేలకు పైగా ఉంటారని సమాచారం. నిజానికి, నిజామాబాద్ జిల్లాలో సీమాంధ్ర నుంచి చాలా ఏళ్ల క్రితం వచ్చి స్థిరపడిననవారి సంఖ్య పెద్దగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నుంచి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో మండవ వెంకటేశ్వర రావు పోటీ చేసి గెలిచే స్థాయికి వచ్చారు. తెలంగాణకు వ్యతిరేకంగా సెటిలర్లు బాన్సువాడలో కాంగ్రెసు అభ్యర్థికి ఓటేసినట్లు భావిస్తున్నారు. అలాగే కొంత మంది మైనారిటీలు కూడా కాంగ్రెసుకు అండగా నిలిచినట్లు సమాచారం. మైనారిటీలు చాలా వరకు కాంగ్రెసుకు సంప్రదాయ ఓటర్లుగా ఉన్నారు. అందుకే, శ్రీనివాస గౌడ్ లెక్కించదగ్గ స్థాయిలో ఓట్లను సాధించారని అంటున్నారు.












Click it and Unblock the Notifications