విమర్శలకు కాలమే సమాధానం చెప్తుంది: జానారెడ్డి
నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణను నెరవేర్చాలని తాను అనునిత్యం ఆలోచిస్తున్నానని చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీపై వేసిన కేసు నిలవదన్నారు. తెలంగాణ ప్రాంతంలోనూ ఉద్యమకారులపై పెట్టిన కేసులు నిలిచేవి కావని వాటి విషయంలో భయాందోళన చెందవద్దని సూచించారు. తెలంగాణ సాధన కోసం కేంద్రంపై పలురూపాల్లో ఒత్తిడి తీసుకు వస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తాము ఆత్మరక్షణలో పడ్డామనడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలకు దూరంగా ఉండాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె కేశవ రావు సూచించారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న వారిని ప్రజలు అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారని చెప్పారు.
Comments
jana reddy keshav rao telangana sakala janula strike hyderabad జానా రెడ్డి కేశవరావు తెలంగాణ సకల జనుల సమ్మె హైదరాబాద్
English summary
Minister Jana Reddy responded today about Telanganites comments about him. He hoped that time will come to prove his commitment.
Story first published: Wednesday, October 19, 2011, 14:20 [IST]