వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్వానీ రథయాత్రలో తెరాస ఎంపి విజయశాంతి

By Pratap
|
Google Oneindia TeluguNews

LK Advani and Vijayashanti
సిద్ధిపేట: బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ రథయాత్రలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి పాల్గొన్నారు. అద్వానీ రథయాత్రకు ఆమె మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్‌లో స్వాగతం చెప్పారు. అద్వానీ రథయాత్రకు ఆమె సంఘీభావం తెలిపారు. అద్వానీ పక్కనే రథయాత్రలో ఆమె నించున్నారు. తెరాసకు దూరమవుతూ బిజెపికి దగ్గరవుతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విజయశాంతి అద్వానీతో పాటు రథయాత్ర చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

అద్వానీని విజయశాంతి కలవడంలో ఏ విధమైన తప్పు లేదని తెరాస శాసనసభ్యుడు కెటి రామరావు ఇది వరకే చెప్పారు. అద్వానీ తన తెలంగాణ యాత్రలో ప్రధానంగా తెలంగాణ అంశంపైనే మాట్లాడారు. ఆయన బుధవారం వివిధ ప్రాంతాల్లో తెలంగాణపై తన అభిప్రాయాలను వెల్లడించారు. కాంగ్రెసుపై విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ విశ్వాసఘాతుకానికి పాల్పడిందని విమర్శించారు. శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును యుపిఎ ప్రభుత్వం ప్రతిపాదిస్తే తాము మద్దతిస్తామని ఆయన అన్నారు.

English summary
TRS MP Vijayashanti participated in BJP leader LK Advani's ratha yatra in Medak district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X