హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఇంటికి సిబిఐ, నిర్మాణం ఖర్చుపై ఆరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి గురువారం సిబిఐ అధికారులు వెళ్లారు. హైదరాబాదులోని లోటస్ పాండులో ఉన్న ఆయన ఇంటికి సిబిఐ అధికారులతో పాటు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ(ఎన్ఆర్ఎస్ఏ), ఐటి అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు చేరుకున్నారు. ఎన్ఆర్ఎస్ఏ సహకారంతో జగన్ ఇంటి నిర్మాణాన్ని, దాని ఖర్చును అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై నగర ప్రణాళికా అధికారులను విచారించనున్నారని సమాచారం. అలాగే ఇంటి నిర్మాణం నియమ నిబంధనలకు అనుగుణంగానే ఉందా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

కాగా జగన్ కేసులో సిబిఐ విచారణ వేగవంతం చేసినట్లుగా కనిపిస్తోంది. కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ శాసనసభ్యుడు గాలి జనార్ధన్ రెడ్డికి సంబంధించిన ఓబుళాపురం మైనింగ్ కేసును విచారిస్తూనే సిబిఐ అధికారులు జగన్ కేసును చూస్తున్నారు. దీంతో జగన్ కేసు కాస్త నిదానంగా వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.

English summary
CBI officers went to YSRC Party president YS Jaganmohan Reddy residence today for estimate his house cost.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X