స్పందిస్తున్న ఒకే ఒక్కడు జగన్!: వాసిరెడ్డి పద్మ

ప్రజా సమస్యలపై స్పందించాల్సిన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కూడా నిమ్మకు నీరెత్తినట్లున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఏం చేయలేని స్థితిలో ఉంటే ప్రతిపక్షం వారితో చేతులు కలిపిందన్నారు. రాష్ట్రం ఇంత క్లిష్ట పరిస్థితిల్లో ఉంటే అసెంబ్లీని సమావేశపర్చాలని టిడిపి ఎందుకు డిమాండ్ చేయడం లేదన్నారు. చంద్రబాబు హయాంలో రైతులు ఎలా ఆత్మహత్యలు చేసుకున్నారో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ అలాగే చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం ప్రభుత్వానికి కీలుగుర్రంలా మారిందన్నారు.












Click it and Unblock the Notifications