సిఎం, బొత్స ఛలో ఢిల్లీ: కాంగ్రెసు నేతల హస్తిన దారి

తమిళనాడు గవర్నర్గా వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య శాసనమండలి స్థానం ఖాళీ కావడంతో ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ దీనిపై అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు 24వ తేది వరకు గడువు ఉంది. గడువు మరెంతో దూరం లేక పోవడం, ఈ స్థానంపై చాలామంది నేతలు ఆశలు పెట్టుకోవడంతో దానిపై చర్చించనున్నారు. బొత్స, కిరణ్ కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాదుతో భేటీ అయి మండలి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశం ఉంది. ఇందులో తెలంగాణపై చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications