సెటిలర్స్ పైన టిఆర్ఎస్ వైఖరి మారుతోందా?
తెలంగాణవాదాన్ని ఎవరూ కాదనలేరు. కానీ స్వతంత్ర భారత దేశంలో ఇష్టం వచ్చిన వారికి ఓటు వేసుకునే హక్కు లేదాను పలువురు ప్రశ్నిస్తున్నారు. తెరాసకు ఓటు వేయని సెటిలర్స్ను గ్రామం విడిచి వెళ్లాలనే వాదనల నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత అభిప్రాయాన్ని కాలరాచేలా తెలంగాణవాదులు వ్యవహరిస్తున్నారని, ఇప్పుడే ఇలా హెచ్చరిస్తే తెలంగాణ వస్తే సీమాంధ్రులకు తెలంగాణలో ఎలాంటి భయం ఉండదని ఎలా నమ్మగలమని వారు ప్రశ్నిస్తున్నారు. కూకట్పల్లిలో తెరాస పోటీ చేయనప్పటికీ అక్కడ కాంగ్రెసుపై తెదేపా గెలుపొందడంతో అక్కడి సెటిలర్స్ పైన పోచారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే బాన్సువాడలో తెదేపా పోటీ చేయనప్పటికీ కాంగ్రెసుకు ఆశించిన మెజార్టీ రావడంతోనూ ఆయన మండిపడ్డారు. అయితే తెలంగాణ వాదం ప్రజల్లో బలంగా ఉన్న సమయంలోనూ సెటిలర్స్ అందుకు అనుకుణంగా నడవక పోవడాన్ని తెలంగాణవాదులు తప్పుపడుతున్నారు.