హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రంలో పరిపాలనా విరామం: వెంకయ్య నాయుడు సెటైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Venkaiah Naidu
హైదరాబాద్: రాష్ట్రంలో శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు విరామాన్ని పాటిస్తున్నారని, సచివాలయం, అసెంబ్లీ విరామంలో ఉందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు గురువారం పార్టీ సమావేశంలో ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పాలన స్తంభించిందని, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేని దౌర్భాగ్యకర పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. 460 మండలాల్లో కరువు నెలకొందని, సర్కారు కరెంటు కొరత తీర్చట్లేదని విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలనా విరామం కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రజలు శాశ్వత విరామాన్ని ప్రకటించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందడం, పాలనా సౌలభ్యం కోసమే తమ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టాలని కోరుకుంటోందని పునరుద్ఘాటించారు. తాము ఏ ప్రాంత ప్రజలకు వ్యతిరేకంగా కాదన్నారు. టీడీపీ మహానాడులో అనుకూల తీర్మానం చేసిందని, టీఆర్ఎస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకుందని గుర్తు చేశారు. వామపక్ష పార్టీలు ఏవైనా సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించలేని స్థితిలో ఉన్నాయన్నారు.

కేంద్ర ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలతో విసిగిపోయి, ధరల పెరుగదలతో తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రజలు యూపీఏ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దించుదామా అని ఎదురు చూస్తున్నారని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పలేదని యూపీఏ భాగస్వామి అయిన ఎన్సీపీ అధినేత శరద్‌పవారే వ్యాఖ్యానించారని.. మరోవైపు అద్వానీ రథయాత్ర విజయవంతమైందని చెప్పారు. వీటిని బట్టి చూస్తే కాంగ్రెస్‌కు వ్యతిరేక, బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. ఎప్పుడైనా మధ్యంతరం వచ్చే అవకాశం ఉందని, పార్టీ శ్రేణులు అందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. రెండు రోజుల పాటు జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు గురువారం అన్నారు.

కేంద్రంలో రోజుకో కుంభకోణం బయటపడుతోంది. యూపీఏ అధికారంలోకి వచ్చిన ఏడేళ్ల నుంచి పెట్రోలు, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ నిష్క్రియాపరత్వంతో రైతులు పంట విరామాన్ని ప్రకటించుకునే దుస్థితి నెలకొంది. యూపీఏను గద్దె దించి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఎప్పుడు గద్దెనెక్కించాలా అని ప్రజలు ఆతృతపడుతున్నారన్నారు. ఇప్పటికే ప్రజలు ఎన్డీఏ హయాంలో చేపట్టిన పథకాలను మననం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ పరిశీలిస్తే కాంగ్రెస్‌కు వ్యతిరేక, బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయన్నది స్పష్టమవుతోందన్నారు. మనపార్టీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజా సమస్యలపై పోరాడుతూ వారితో మరింత మమేకం కావాలన్నారు.

English summary
BJP senior leader Venkaiah Naidu make satire on state government in yesterday's party meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X