జగన్కు చెక్, ప్రత్యామ్నాయాలపై కాంగ్రెసు దృష్టి

సుచరిత, పిన్నెల్లి నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని బలపరిచేందుకు చర్యలు ప్రారంభించింది. మొదటి నుండి జగన్కు మద్దతు పలుకుతున్న పిన్నెల్లిపై మొదట దృష్టి సారించింది. ఆయన నియోజకవర్గంలో ఖాళీ ఐన మార్కెట్ యార్డు ఛైర్మన్, వైస్ చైర్మన్ పదవులను పిన్నెల్లి వ్యతిరేక వర్గానికి కట్టబెట్టారట. తద్వారా కాంగ్రెసును బలపర్చేందుకు ఇది ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తోంది. ఇక సుచరిత నియోజకవర్గం ఐన ప్రత్తిపాడులోనూ ఇంచార్జులను నియమించేందుకు కాంగ్రెసు కసరత్తు చేస్తోందని సమాచారం. ఇప్పటికే ఈ నియోజకవర్గ వ్యవహారాలు ఎంపీ రాయపాటి సాంబశివ రావు, మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ చూస్తున్నారు. ఆ నియోజకవర్గ పార్టీ శ్రేణులు పనుల కోసం వీరిద్దరినే కలుస్తున్నారట. దీంతో ఇప్పటికే సుచరిత హవాకు గండి కొట్టినట్లయింది. ఇక ఇంచార్జులను నియమిస్తే ఆమె హవా మరింత తగ్గించవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications