వైయస్ ఆప్తుడే నమస్తే తెలంగాణ ఎండి: కడియం శ్రీహరి

ముడుపులను నేరుగా తీసుకోకుండా ఇలా పెట్టుబడులు పెట్టించారన్నారు. ఇంటర్ కాంటినెంటల్ కంపెనీకి కూడా రాజమే సీఎండీ అన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ పెట్టిన నమస్తే తెలంగాణ పత్రికకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న రాజం మధ్యవర్తిత్వంతోనే పోలవరం టెండర్లు స్యూ కంపెనీకి దక్కాయని, సిఎం కిరణ్తో రాజం భేటీ తర్వాతే అర్హత నిబంధనలు సడలించి స్యూ కంపెనీకి ఈ టెండర్లు కట్టబెట్టారని, స్యూ కంపెనీ డబ్బులనే తీసుకొచ్చి రాజం నమస్తే తెలంగాణ పత్రికలో పెట్టుబడిగా పెట్టారని ఆరోపించారు. ఈ వ్యవహారాలన్నీ కెసిఆర్కు తెలియకుండానే జరిగాయా అని ప్రశ్నించారు. అందుకే పోలవరం టెండర్లు ఖరారు కాగానే ఆ ప్రాజెక్టును కీర్తిస్తూ నమస్తే తెలంగాణ పత్రికలో వార్త వచ్చిందన్నారు. తమ ఆరోపణలపై ఎప్పుడైనా ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, దానికి ముందు తన పత్రికకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చిందీ... ఎవరు ఎంత ఇచ్చింది బహిర్గతం చేయాలని కెసిఆర్ను డిమాండ్ చేశారు.
స్యూ కంపెనీ మొదట ఈ ఇంటర్ కాంటినెంటల్ కంపెనీలో కొన్ని షేర్లను మొదట ఓ ధరకు ఆ తర్వాత మరో ధరకు పెట్టిందన్నారు. రెండోసారి పెట్టిన మొత్తం డబ్బును రాజం తెచ్చి ఇంటర్ కాంటినెంటల్ కంపెనీ పేరుతో నమస్తే తెలంగాణ పత్రికలో పెట్టుబడిగా పెట్టారు.
జగన్ పత్రిక సాక్షిలో పెట్టుబడుల సమీకరణకు ఎలాంటి మార్గాలు అవలంబించారో ఇక్కడా అవే కనిపిస్తున్నాయి. దీనికి తెరాస నేతలు సమాధానం చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టు కడితే రక్తం ఏరులై పారుతుందని హెచ్చరికలు చేసిన పార్టీకి చెందినవారే ఇప్పుడు ఆ ప్రాజెక్టు టెండర్ల ఖరారులో కీలక పాత్ర వహించడం దౌర్భాగ్యమని మండిపడ్డారు. ప్రభుత్వం విధించిన అర్హత నిబంధనలు స్యూ కన్సార్షియంకు లేవని, ఒక ప్రైవేటు కంపెనీలో పని చేసినట్లు ఒక సర్టిఫికెట్ తెచ్చి ఈ కంపెనీ ఇచ్చిందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వం వద్ద చేసిన పనులకు సంబంధించిన అనుభవం మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారని, ఆ ప్రైవేటు కంపెనీ పని అనుభవం కూడా దొంగ సర్టిఫికెట్ అని ఆరోపించారు. పోలవరంకు తాము వ్యతిరేకం కాదని అందులో జరిగే అవినీతికి వ్యతిరేకమన్నారు. అదే సమయంలో డిజైన్ కూడా మార్చాలన్నారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications