కెసిఆర్కు పోలవరం మకిలి: ఇరుకునపడ్డ బిజెపి

పార్టీ కూడా ప్రాజెక్టు డిజైన్లో మార్పు, నిర్వాసితులకు సమాన విలువైన భూమి కేటాయింపు వంటి డిమాండ్లు చేస్తూ వచ్చింది. తీరా టెండర్లు దక్కించుకున్న కంపెనీతో టిఆర్ఎస్ నేతలకు సంబంధం ఉందన్న ఆరోపణలు బిజెపిని కూడా ఇరుకున పెడుతున్నాయి. ఏ ప్రజల కోసమైతే ఉద్యమిస్తున్నామో అదే ప్రజలకు నష్టం చేకూర్చే ప్రాజెక్టు టెండర్లను జెఏసిలో తమ భాగస్వామి దక్కించుకోవడాన్ని బిజెపి జీర్ణించుకోలేకపోతోంది. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నామని చెబుతూనే పోలవరాన్ని దక్కించుకున్న టిఆర్ఎస్ గురించి ప్రశ్నిస్తే మొహం ఎక్కడ పెట్టుకోవాలన్న ప్రశ్నలు ఆ పార్టీ నేతల మెదళ్లను తొలిచేస్తున్నాయి.
తెలంగాణవాసులకే అన్యాయం చేసే టెండర్లను దక్కించుకున్న టిఆర్ఎస్ నేతలతో మళ్లీ తెలంగాణ ఉద్యమాన్ని ఎలా కొనసాగించాలన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరిగినా మళ్లీ టీఆర్ఎస్తో జట్టు కట్టి ఉద్యమిస్తే తమ పార్టీని ప్రజలు నమ్ముతారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఒకవేళ టెండర్ల గుట్టును బయట పెట్టాలంటే టీఆర్ఎస్ను టార్గెట్ చేయక తప్పదు. టార్గెట్ చేస్తే జేఏసీలో తమ పార్టీకి చిక్కులు ఎదురయ్యే అవకాశాలున్నాయని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అంటే ప్రస్తుతం బిజెపి పరిస్థితి ఎటూ పాలుపోని విధంగా తయారైంది. అయితే గత కొంతకాలంగా జెఏసి నుండి బయటకు వచ్చి ఉద్యమించాలన్న ఆలోచన కూడా బిజెపిలో ఉన్నట్లుగా వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications