లవర్ అప్పు తీర్చుటకు కజిన్ను కిడ్నాప్ చేసిన అమ్మాయి

అయితే మెడిసిన్స్ తీసుకు రావడానికి వెళ్లిన పాయల్, ఆదిత్య ఇద్దరు ఇంటికి రాకపోవడంతో బాల్చందాని మొదట ఇద్దరు కిడ్నాప్కు గురయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ తర్వాత మంగళవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో బాల్చందానికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. పోలీసులు పక్కా వ్యూహంతో ఫోన్ ట్రేస్ చేశారు. నిందితులు మొదట కోటి రూపాయలు డిమాండ్ చేయడం బాల్చందాని తగ్గిస్తూ చర్చలకు దిగడం వల్ల పోలీసులకు ఫోన్ నంబర్లు ట్రేస్ చేయడం ఈజీ అయింది. కిడ్నాపర్లు చివరకు రూ.25 లక్షలకు దిగి వచ్చారు. ఇరవై లక్షలు జ్యువెల్లరీ, రూ.5 లక్షలు నగదు రూపంలో తీసుకోవడానికి ఒప్పుకున్నారు.
ఇద్దరు వ్యక్తులు డబ్బు తీసుకోవడానికి వెళ్లిన సమయంలో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఆ సమయంలో పాయల్ అక్కడే ఉండటం పోలీసులను ఆశ్చర్యపరిచింది. పోలీసులు విచారించడంతో ఆమె బండారం బయటపడింది. డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా ఆదిత్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వారిని ప్రశ్నించడంతో గుజరాత్ కళాశాల సమీపంలోని వాల్ స్ట్రీట్ బిల్డింగ్లోని ఏడో ఫ్లోర్లో ఆదిత్యను ఉంచినట్లు తేలింది. అక్కడకు వెళ్లగానే పాయల్ లవర్ నిషాంత్ ఆదిత్యకు గార్డులా నిలబడి కనిపించాడు. పోలీసులు నిందితులను బుధవారం అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications