ఆమరణ దీక్షకు కోదండరామ్, స్వామి గౌడ్ రెడీ?

Kodandaram and Swamy Goud,
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘాల జెఎసి నేత స్వామి గౌడ్ కూడా ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేయాలనే తమ ఆలోచనను వారిద్దరు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావు చెవిన వేసినట్లు తెలుస్తోంది. అయితే, కెసిఆర్ దీనిపై తన అభిప్రాయాన్ని వెల్లడించలేదని అంటున్నారు. మేం నిరాహార దీక్ష చేస్తాం, మీరు వ్యూహ రచన చేయండని ఆ ఇద్దరు నేతలు కూడా కెసిఆర్‌ను అడిగినట్లు తెలుస్తోంది. దానికి కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అంటున్నారు.

తెలంగాణ ప్రజాప్రతినిధుల 72 గంటల నిరవధిక నిరాహార దీక్షల తర్వాత తాము ఆమరణ నిరాహార దీక్షకు దిగాలని కోదండరామ్, స్వామి గౌడ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. నవంబర్ 1వ తేదీ నుంచి 72 గంటల పాటు తెలంగాణ ప్రజాప్రతినిధులు నిరవధిక నిరాహార దీక్షలు చేయనున్నారు. ఈ దీక్షల్లో తెరాస శాసనసభ్యులతో పాటు బిజెపి, సిపిఐ, తెలంగాణ నగారా శాసనసభ్యులు పాల్గొంటారని భావిస్తున్నారు. అయితే, తాము 72 గంటల నిరాహార దీక్షను నిరవధిక దీక్షలుగా మారుస్తామని తెరాస శాసనసభ్యులు అంటున్నారు. తెరాస శాసనసభ్యుల నిరవధిక నిరాహార దీక్షలను దృష్టిలో పెట్టుకునే కోదండరామ్, స్వామిగౌడ్‌ ఆలోచనపై కెసిఆర్ మాట్లాడడం లేదని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+