ప్రతి ముగ్గురు కేరళవాసుల్లో ఒకరు మహానగరంలో

Kerala Map
న్యూఢిల్లీ: పదేళ్ల క్రితం అంటే 2001 సంవత్సరం లెక్కల ప్రకారం కేవలం నాలుగు శాతం కేరళీయులు మాత్రమే మహా నగరాలలో జీవించే వారు. కానీ ఇప్పుడు ప్రతి ముగ్గురిలో ఒకరు కంటే ఎక్కువ మంది నగరాల్లోనే జీవిస్తున్నారు. నాటికి నేటికి దేశంలో మిలియన్ - ప్లస్ ప్రజలు జీవిస్తున్న నగరాల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం పదమూడు శాతం మంది భారతీయులు 53 నగరాలలో జీవిస్తున్నారు. అదే 2001లో 35 నగరాల్లో 11 శాతం మంది ఉన్నారు. మార్పులో భాగంగా చాలా రాష్ట్రాల్లో నగరీకరణ పెరిగింది. తద్వారా నగరాలు పెరిగి నగరంలో నివసించే జనాభా పెరిగింది. అయితే కేరళ నగరీకరణ మాత్రం ఈ పదేళ్లలో అనూహ్యంగా పెరిగింది. పదేళ్లుగా కేరళ పలు రంగాలలో వేగంగా దూసుకు పోతోంది. కేరళ ఇప్పుడు దాదాపు సగం నగరీకరణ చెందిన రాష్ట్రం. అంతేకాదు మహారాష్ట్ర, తమిళనాడు కంటే వేగంగా పెరిగింది.

2011వ సంవత్సరంలో కేరళలో కొచ్చి, కోజీకోడ్, త్రిసూర్, మలప్పురం, తిరువనంతపురం, కన్నూరు, కొల్లాం తదితర పట్టణాలు మిలియన్ ప్లస్ నగరాలుగా ఉన్నాయి. దేశంలోనే పెద్దదైన ఉత్తర ప్రదేశ్‌తో పోల్చుకుంటే కేరళలో పలు నగరాలు మిలియన్ ప్లస్ ప్రజలను కలిగి ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో కేవలం 7శాతం ప్రజలు మాత్రమే మిలియన్ ప్లస్ నగరాలలో నివసిస్తున్నారు. ఇది 2001లో ఆరు శాతం. అంటే యుపి నగరీకరణలో పెద్దగా మార్పు లేదు. హర్యానా, బీహార్ రాష్ట్రాలలో అతితక్కువ నిష్పత్తిలో ప్రజలు నగరాలలో ఉంటున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బంగా రాష్ట్రాలు మొదటి ఐదు స్థానాలలో ఉన్నాయి. అయితే ఆయా రాష్ట్రాలలో నగరీకరణ కేరళ కంటే తక్కువ శాతం నమోదు కావడం విశేషం. కాగా గత పదేళ్లలో మిలియన్ ప్లస్ జన సంఖ్య కలిగిన నగరాలు బాగా పెరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+