వారు లెక్కలెలా కట్టగలరు?: మెడిసిన్ ఎంట్రెన్స్పై జగన్
జగన్ ఓదార్పులో భాగంగా గుంటూరు జిల్లాలోని చుండూరు, తెనాలి మండలాల్లో శుక్రవారం పర్యటించారు. రైతుల వెతల పట్ల ఆయన సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తర్వాత అన్నింటి ధరలు పెరుగుతున్నాయన్నారు. వైయస్ బతికి ఉన్నప్పుడు రైతులకు కనీస మద్దతు ధర లభించేదని కానీ ఆయన తర్వాత రైతులు పూర్తిగా నష్టాల్లో కూరుకు పోతున్నారన్నారు. వైయస్ హయాంలో పేదవాడి ప్రాణాలకు భరోసా ఉండేదని, కానీ ఇప్పుడు 108కి ఫోన్ చేస్తే డీజిల్ లేదని సమాధానం వస్తుందని విమర్శించారు. కాగా శుక్రవారం జగన్ ఓదార్పులో ఎమ్మెల్యేలు బాబూరావు, మేకతోటి సుచరిత, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
English summary
YSRC Party president, Kadapa MP YS Jaganmohan Reddy questioned how Bipc students count if medicine entrance conduct NEET.
Story first published: Saturday, October 29, 2011, 9:22 [IST]