ఎమ్మెల్యేల రాజీనామాలు: ఫలించని బొత్స బుజ్జగింపులు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెసు అధిష్టానం తన మాటను నిలబెట్టుకోలేకపోయిందని, తెలంగాణలో పార్టీ సర్వనాశనమైందని రాజయ్య అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు నడిచేందుకు తెలంగాణ కోసం ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనేందుకు సిద్ధపడ్డామని ఆయన చెప్పారు. తాము ఎప్పుడు కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కన్నా ప్రజల ఆకాంక్షే ముఖ్యమని ఆయన అన్నారు అంతకు ముందుకు తెరాస శాసనసభ్యులు హరీష్ రావు, కెటి రామారావు కాంగ్రెసుకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న జూపల్లి కృష్ణారావు, సోమారపు సత్యనారాయణ, రాజయ్యలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం జూపల్లి కృష్ణారావు నివాసంలో జరిగింది.












Click it and Unblock the Notifications