హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం చెప్పినట్టు వింటా: శ్రీధర్ బాబు, జూపల్లికి జవాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sridhar Babu
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమైక్యంగా ఉన్నంత వరకు తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాలు పాటిస్తుంటూనే ఉంటానని పౌరసరఫరా శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై తన చిత్తశుద్ధిని మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు శంకించాల్సిన అవసరం లేదన్నారు. తాను తన చిత్తశుద్ధిని ఏ పార్టీకి తాకట్టు పెట్టలేదని, పార్టీలో ఉంటూనే తెలంగాణ కోసం పోరాటం చేస్తానన్నారు. తాను శవాలపై రాజీనామాలు చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కావాలనే రచ్చబండను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుందన్నారు.

తనకు తెలంగాణ ముఖ్యమే అలాగే అభివృద్ధి కూడా ముఖ్యమేనన్నారు. తెలంగాణ వచ్చే దాకా ఈ ప్రాంతంలో అభివృద్ధి ఆగిపోవాలా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రూపాయికి టీ కూడా దొరకడం లేదని అలాంటిది కిలో బియ్యం ఇవ్వడం సాహసోపేతమన్నారు. డిసెంబరు తొలివారంలోగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశాల నిర్వహణకు ఎలాంటి భయం లేదన్నారు. కాంగ్రెస్సే తెలంగాణ ఇస్తుందన్నారు. టిఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలను ట్రాప్‌లో పడేయాలని చూస్తోందని వారంతా ఒకే త్రాటిపై ఉన్నారన్నారు. ప్రతిపక్షం అవిశ్వాసం పెడితే ఎదుర్కొంటామన్నారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్ష అధిష్టానంపై ఒత్తిడి తీసుకు రావడానికే అన్నారు.

English summary
Minister Sridhar Babu said today that he will go in CM Kiran Kumar Reddy direction till divide Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X