చంద్రబాబు 'షేర్ల' వ్యవహారంపై హైకోర్టు విస్మయం

కాగా వైయస్ విజయమ్మ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులపై వేసిన పిటిషన్పై మంగళవారం విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే విజయమ్మ తరఫు న్యాయవాది షేర్లపై వివరించినప్పుడు వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా రూ.38 వేలుగా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ వార్షికాదాయం ఒక్కసారిగా రూ.కోట్లకు చేరిందని ఆయన వాదించారు. విదేశాలకు హవాలా ద్వారా నిధులు మళ్లించి అక్కడి నుండి పెట్టుబడులు పెట్టించి పన్నులు ఎగ్గొట్టారని చెప్పారు. చంద్రబాబు ఆస్తులపై ప్రాథమిక విచారణ జరిపించడానికి ఈ ఆధారాలు సరిపోతాయని చెప్పారు. చంద్రబాబుతోపాటు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ల ఆస్తులపైనా విచారణ జరగాల్సి ఉందన్నారు. ఆయన వాదన విన్న తర్వాత విచారణను వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications