వైయస్ జగన్ ఇలాకాపై ఎమ్మెల్యే చిరంజీవి కన్ను

రాష్ట్ర కార్యవర్గంలో ఏ పదవులు అడగాలనే దానిపైన చిరు వర్గం నేతలు సమాలోచనలు జరుపుతున్నారట. గత 2009 సాధారణ ఎన్నికల్లో పిఆర్పీకి అధిక మెజార్టీ వచ్చిన నియోజకవర్గాలు, జిల్లాల పైన చిరు దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తోంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా తదితర జిల్లాల డిసిసి అధ్యక్ష పదవులను అడగాలని చిరు వర్గం భావిస్తున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా కడప జిల్లా డిసిసిని అడగాలని అభిప్రాయాలూ ఉన్నాయట. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కడప ప్రజలు చిరంజీవికి బ్రహ్మరథం పట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర కార్యవర్గంలో ఏ స్థాయిలో ఎన్ని పదవులు కోరాలి, ఆయా పదవులకు ఎవరెవరిని ప్రతిపాదించాలనే దానిపై చిరంజీవి, ముఖ్య నేతలు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications