Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గర్వంగా ఉంది, ఆరోగ్యంపై ఆందోళన: కోమటిరెడ్డి భార్య

Komatireddy Venkat Reddy
నల్లగొండ: తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి తన భర్త ఆమరణ నిరాహార దీక్షకు దిగడం గర్వంగా ఉందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సబిత అన్నారు. కుమారుడితో కలిసి ఆమె గురువారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్ష శిబిరాన్ని సందర్శించారు. గురువారంనాటికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు చెప్పారు. తన భర్త ఆరోగ్యంపై తనకు ఆందోళనగా ఉందని, అయితే ప్రజల కోసం దీక్ష చేస్తున్నందుకు గర్విస్తున్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి భార్య అన్నారు.

వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆమె కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం తన తండ్రి దీక్ష చేస్తున్నారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించడం అవసరమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనయుడు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలోని క్లాక్ టవర్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు మద్దతు ప్రకటిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+