హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెద్దల కోసం ఆ ఇద్దరు కోట్లు అడిగారు: శశికుమార్

By Pratap
|
Google Oneindia TeluguNews

OMC Mines
హైదరాబాద్: పెద్దల కోసమంటూ గనుల లీజు ఇవ్వడానికి ఐఎఎస్ అధికారులు రాజగోపాల్, శ్రీలక్ష్మి తన కోట్ల రూపాయల లంచం అడిగారని మైనింగ్ వ్యాపారి శశికుమార్ ఆరోపించారు. ఆయన మంగళవారం ఓ టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడారు. వారిద్దరు అక్రమాలకు పాల్పడినట్లు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. శ్రీలక్ష్మి తనను మూడు కోట్ల రూపాయలు లంచం అడిగారని ఆయన చెప్పారు. లంచం ఇస్తేనే గనుల లీజు ఇస్తామని రాజగోపాల్, శ్రీలక్ష్మి చెప్పారని, తాను అందుకు సిద్ధపడలేదని ఆయన అన్నారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి అక్రమంగా గనులు లీజుకు ఇచ్చారని ఆయన ఆరోపించారు. బ్రాహ్మణి స్టీల్స్‌కు కాప్టివ్ మైన్స్ కింద ప్రభుత్వం ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి గనులు లీజుకు ఇచ్చిందని, ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయలేదని, జీవోలో ఆ విషయం చెప్పలేదని ఆయన అన్నారు.

గనుల లీజులకు సంబంధించి వంద తప్పులు తాను చూపిస్తానని ఆయన చెప్పారు. రాజగోపాల్, శ్రీలక్ష్మిలను వెంటనే అరెస్టు చేయాలని, లేదంటే వారు సాక్ష్యాలను తారుమారు చేస్తారని ఆయన అన్నారు. అక్రమాలను నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తనకు గనులు లీజుకు ఇవ్వడానికి సాకులు చూపిన అధికారులు గాలి జనార్దన్ రెడ్డికి అక్రమంగా లీజుకు ఇచ్చారని ఆయన చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి తాను 25 సార్లు మొర పెట్టుకున్నానని ఆయన చెప్పారు. రాజగోపాల్, శ్రీలక్ష్మి తనను బెదిరించారని ఆయన ఆరోపించారు.

English summary
Mining contractor Shashi Kumar alleged that IAS officers Rajagopal and Srilaxmi resorted to violations in granting mining leases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X