ఎమ్మార్ - ఎంజిఎఫ్ బాస్ గుప్తాకు సిబిఐ షాక్

CBI
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ఎమ్మార్ - ఎంజిఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రవణ్ గుప్తాకు సిబిఐ షాక్ ఇచ్చింది. విచారణకు సహకరించకపోవడంతో ఢిల్లీకి చెందిన ఆ వ్యాపారవేత్త తీవ్రమైన ఇరకాటంలో పడాల్సి వచ్చింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సిబిఐ అధికారులు ఇటీవల మంగళవారంనాడు ఆయనను హైదరాబాదులోని దిల్‌కుషా అతిథి గృహంలో ప్రశ్నించారు. ఆయన తీరుకు చిరాకుపడిన సిబిఐ అధికారులు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు హైదరాబాదు విడిచి వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది.

అత్యవసరంగా తాను హాజరు కావాల్సిన ముఖ్యమైన పనులు ఉన్నాయని, ఢిల్లీకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని గుప్తా పదే పదే కోరినా సిబిఐ అధికారులు నిరాకరించారని తెలుస్తోంది. తన వెంట చార్టర్డ్ అకౌంటెంట్ (సిఎ)ను తీసుకురాకపోవడంతో ఆయన ఈ చిక్కుల్లో పడాల్సి వచ్చిందని అంటున్నారు. గుప్తాను సిబిఐ అధికారులు రోజంతా విచారించారని, ఎంతగా ప్రశ్నించినా తనకు ఏమీ తెలియదని, సిఎకే అన్నీ తెలుసునని సమాధానం ఇస్తూ పోయారని అంటున్నారు. సిఎనే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలుగుతాడని గుప్తా సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.

గుప్తా తీరుకు విసిగిపోయిన సిబిఐ అధికారులు సిఎను ఇక్కడికి పిలవాలని చెప్పారని అంటున్నారు. అయితే, సిఎ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడని, నాలుగైదు రోజుల వరకు రాలేడని చెప్పి నేను వెళ్లవచ్చునా అని గుప్తా అడిగినట్లు తెలుస్తోంది. సిఎ తమ ముందుకు వచ్చే వరకు హైదరాబాదులోనే ఉండాలని సిబిఐ అధికారులు నిక్కచ్చిగా గుప్తాకు చెప్పారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+