గొంతు నొక్కేస్తున్నారు: పరకాల, జయశంకర్పై వ్యాఖ్యలకు నిరసన

టిఆర్ఎస్కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకుండా ఉండటానికి ఇలా దాడి చేశారన్నారు. తనకు రక్షణ కల్పిస్తానని చెప్పిన మంత్రి సమక్షంలోనే దాడి జరగడం గర్హనీయమన్నారు. కాగా ఆచార్య జయశంకర్ పైన పరకాల చేసిన వ్యాఖ్యలపై తెలంగాణవాదులు మండిపడ్డారు. తెలంగాణకు సంబంధించి జయశంకర్ చెప్పిన కట్టుకథలు ఏమిటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. శనివారం జరిగిన విశాలాంధ్ర మహా సభ సమావేశంలో పరకాల మాట్లాడుతూ జయశంకర్ పచ్చి అబద్దాలు చెప్పారని నిర్ద్వంధంగా నిరూపించిన వ్యక్తి నల్గొండకు చెందిన వారని, ఆయన చెప్పినవి ప్రజల్లోకి వెళితే ప్రజలు తిరగేసి కొడతారనే వారు అడ్డుకుంటున్నారని టిఆర్ఎస్ను ఉద్దేశించి అన్నారు.












Click it and Unblock the Notifications