బాబు! నిజాయితీ నిరూపించుకో: బొత్స సత్తిబాబు

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో బాబు ఆస్తులపై పిటిషన్లు వేస్తే ఆయన కోర్టుకెళ్లి స్టేలు తెచ్చుకున్నారని ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు ఆరోపించారు. బాబు ఆస్తులపై విచారణను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఏలేరు, లిక్కర్ స్కాంలలో కేసులు వేస్తే స్టేలు తెచ్చుకున్నారన్నారు. బాబుపై ఏ కేసు వేసినా స్టే ద్వారా తప్పించుకో చూశారన్నారు. బాబు అవినీతిపరుడని పిల్లనిచ్చిన మామ, బావమరిది, అత్తగారు కూడా అన్నారని విమర్శించారు. దేశంలోనే అత్యంత ధనవంత రాజకీయ నాయకుడు బాబు అని తెహెల్కా ఎప్పుడో చెప్పిందన్నారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే కేసు విచారణ పూర్తయ్యేంత వరకు తన స్థానంలో టిడిపి అధ్యక్ష బాధ్యతలు వేరొకరికి అప్పగించాలన్నారు. తన నిజాయితీ నిరూపించుకున్న తర్వాతే ఆతను పార్టీ బాధ్యతలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications