ఎవరికీ భయపడేది లేదు: టిడిపి అధినేత బాబు

Chandrababu Naidu
శ్రీకాకుళం:ఎవరికీ భయపడేది లేదని, అవినీతిపై తాను పోరాటం కొనసాగిస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రైతు పోరు బాట చేస్తున్న ఆయన మంగళవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లాలో ఆ మాటలన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని ఆయన చెప్పుకున్నారు. రాజకీయ కక్షతోనే తనపై పిటిషన్లు వేశారని ఆయన వ్యాఖ్యానించారు. సామాజిక కార్యకర్త అన్నా హజారే స్ఫూర్తితో అవినీతిపై ఉద్యమిస్తానని ఆయన అన్నారు.

రైతు సమస్యలను పట్టించుకోని చేతగాని, సిగ్గులేని ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని అంతకు ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి నైతిక స్థయిర్యాన్ని, భరోసాను ఇవ్వడమే తన రైతు పోరు బాటు లక్ష్యమని ఆయన అన్నారు. విజయనగరం జిల్లాలో రైతు పోరు బాటును ముగించుకున్న ఆయన మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆయన అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు రైతు పోరు బాటు కొనసాగుతుందని ఆయన చెప్పారు.

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. ఆముదాలవలసలో మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లి చంద్రబాబు ఇటీవల వివాహమైన ఆయన కూతురు, అల్లుడిని ఆశీర్వదించారు. రైతులను చైతన్యపరిచి ఉద్యమానికి సమాయత్తం చేయడమే తన ఉద్దేశ్యమని చంద్రబాబు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+