చూపిస్తే కెసిఆర్‌కు ఆస్తులు రాసిస్తా: లగడపాటి సవాల్

Lagadapati Rajagopal
ఏలూరు: తనకు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఆస్తులు ఉన్నందు వల్లే తాను సమైక్యాంధ్ర కోరుకుంటున్నానని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిరూపిస్తే తన ఆస్తులు మొత్తం అతనికే రాసిస్తానని విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలో సవాల్ విసిరారు. తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సింది కాంగ్రెసు పార్టీయేనన్నారు. రైతాంగానికి ఎంతో లాభదాయకమైన పోలవరం ప్రాజెక్టును ఎవరూ అడ్డుకోవద్దని సూచించారు. పోలవరాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నారు.

వైయస్సార్సీ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్లిన తమ ఎమ్మెల్యేలు తిరిగి వెనక్కి రావడం వెనుక కాంగ్రెసు గొప్పతనం ఉందని మంత్రి సాకె శైలజానాథ్ అన్నారు. రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఒప్పుకునేది లేదన్నారు. సమైక్య రాష్ట్రం కోసం తాము ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+