Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లగడపాటితో కలిసి భోంచేసిన తెలంగాణ ప్రాంత నేతలు

Lagadapati Rajagopal-Errabelli Dayakar Rao
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించే విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌తో కలిసి తెలంగాణ ప్రాంత నేతలు గురువారం భోజనం చేశారు. విషయానికొస్తే ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆధ్వర్యంలో లక్డీకాపూల్‌లో సద్బావనా సదస్సు జరిగింది. ఎవరు ఏ వాదాన్ని బలంగా వినిపిస్తున్నప్పటికీ ఈ కార్యక్రమంలో ఇరు ప్రాంతాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. లగడపాటితో పాటు విశాలాంధ్ర మహా సభ నేత పరకాల ప్రభాకర్, తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు, తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు వివేక్, కె కేశవ రావు పాల్గొన్నారు. ఇరు ప్రాంతాల నేతలు కలిసి భోజనం చేశారు. అందరూ కలిసి ఇరు ప్రాంతాలలో పర్యటించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సామరస్య పూర్వకంగా విభజన జరగాలని తెలంగాణ నేతలు సమావేశంలో కోరారు.

కాగా సమావేశం అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంపై సీమాంధ్ర నేతలను ఒప్పించేందుకే సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరకాల ప్రభాకర్ రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్రం సామరస్యంగా విడిపోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని ప్రశ్నించారు. స్పీకర్ చర్చలకు పిలిస్తే తమ రాజీనామాలు ఆమోదించమని కోరతామని చెప్పారు. అయితే స్పీకర్ నుండి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు. సమావేశం అనంతరం కెకె, వివేక్ మాట్లాడకుండానే వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+