హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్విచ్ వేస్తే బల్బు వెలిగేంత ఈజీకాదు: తెలంగాణపై కెకె

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Keshav Rao
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమంటే స్విచ్ వేస్తే బల్బు వెలిగేంత ఈజీ కాదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె కేశవ రావు శుక్రవారం అన్నారు. ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరిగిన భేటీకి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం తాము చిత్తశుద్ధితో పోరాడుతున్నామన్నారు. తెలంగాణ రాకుంటే తాము ప్రజల్లోకి వెళతామని చెప్పారు.

పార్లమెంటు సమావేశాలకు ముందే తెలంగాణపై ప్రకటన వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యులలో విభేదాలు తెచ్చేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కాగా ఈ సమావేశానికి కెకెతో పాటు టిఆర్ఎస్ నేత నాయిని నర్సింహా రెడ్డి, నాగం వర్గం ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి, ఉస్మానియా జెఏసి హాజరయ్యారు.

English summary
Congress senior leader K Keshav Rao make controversial comments again on Telangana. He said Telangana is not like switch board and bulb.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X