విజయమ్మ పిటిషన్ వైయస్ ప్రాజెక్టులపైనే: యనమల

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి సత్యాలను అసత్యాలుగా చూపి, అధికారంలోకి వచ్చిన తర్వాత ధనదాహం తీర్చుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆమోదం పొందిన 64 మెగా ప్రాజెక్టులపై ఆరోపణలు చేసిన వైయస్ తాను అధికారంలోకి రాగానే కేవలం నాలుగింటిన మినహాయించి అన్ని మెగా ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసి అదనపు లబ్ధిని చేకూర్చారని ఆయన అన్నారు. అది వైయస్ తప్పు కాదా అని ఆయన అడిగారు.
చంద్రబాబు హయాంలోని మెగా ప్రాజెక్టులపై విచారణ చేపట్టాలనుకుంటే అది చంద్రబాబుపై చేపట్టకూడదని, అవే ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసిన వైయస్ మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు రోశయ్య, గీతారెడ్డిపై విచాణకు ఆదేశించాలని ఆయన అన్నారు. వైయస్ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రయోజనం పొందింది వైయస్ విజయమ్మ కుమారుడు వైయస్ జగన్ మాత్రమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications