వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టుకు వెళ్లను: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
న్యూఢిల్లీ: తన అస్తులపై హైకోర్టు సిబిఐ విచారణకు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. సిపిఐ జాతీయ కార్యదర్శి ఎబి బర్దన్‌తో భేటీ తర్వాత ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనపై బురద చల్లి ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆయన అన్నారు. తాను నిర్దోషినని 23 కేసుల్లో కోర్టులే చెప్పాయని ఆయన అన్నారు.

సిబిఐ సంస్థ కాంగ్రెసు జేబు సంస్థగా మారిందని ఆయనవిమర్శించారు. రైతు పోరు బాట యాత్ర అనంతరం ఆయన ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీకి వచ్చిన ఆనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సిబిఐకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా ఉంటేనే సరియైన న్యాయం జరుగుతుందన్నారు. ప్రత్యర్థులను వేధఇంచేందుకు సిబిఐని కాంగ్రెసు పార్టీ వాడుకుంటుందని విమర్శించారు. అన్ని సంస్థలలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

సిబిఐ స్వతంత్రంగా వ్యవహరించాలని తాను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానన్నారు. సిబిఐ, రైతు సమస్యలపై జాతీయ స్థాయి నేతలతో చర్చించేందుకు తాను ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాల్సి ఉందన్నారు. కాగా రెండు రోజుల పాటు బాబు ఢిల్లీలోనే ఉండనున్నారు.

English summary
TDP president N Chandrababu Naidu said that he will not challenge high Court orders in Supreme Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X