కోనేరు ప్రసాద్ పిటిషన్పై కోర్టు నిర్ణయం వాయిదా

అండర్ ట్రయల్ ఖైదీగా కోనేరు ప్రసాద్ ప్రస్తుతం హైదరాబాదులోని చంచల్గుడా జైలులో ఉంటున్నారు. శ్రీకాకుళంలో హెవీ మెటల్స్ తయారు చేస్తున్న రెండు కంపెనీలు ట్రైమెక్స్ శాండ్స్, ట్రైమెక్స్ ఇండస్ట్రీస్లకు తాను డైరెక్టర్గా ఉన్నానని, వివిధ దేశాల్లోని కంపెనీలతో కలిసి తాను పనిచేస్తున్నానని, తాను 2009 వరకు దుబాయ్కి చెందిన ఎన్నారైనని, ప్రస్తుతం భారత్లో స్థిరపడ్డానని ఆయన తన పిటిషన్లో చెప్పుకున్నారు. తన సంపన్నమైన జీవశైలిని, ఆరోగ్యకారణాలను చూపుతూ తనను ప్రత్యేక తరగతి ఖైదీగా గుర్తించాలని ఆయన కోర్టును కోరారు.












Click it and Unblock the Notifications