ఆ ఐఏఎస్లకు ఉరే సరి: మరో మైనింగ్ వ్యాపారి ఫైర్
వారిద్దరు అధికారులు మైనింగ్ డిపార్టుమెంటును నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఈ పరిశ్రమలో చాలా సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఇలాంటి అక్రమాల ఆఫీసర్లను చూడలేదన్నారు. ఇలాంటి అక్రమ అధికారులు ఉంటే ఎన్నారైలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. వారికి బహిరంగ ఉరి శిక్షే సరైనదన్నారు. వారికి జీవించే హక్కు లేదన్నారు. గనుల అక్రమాలపై కోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన చెప్పారు.
ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్ మైనింగ్ కోసం అమరేందర్ రెడ్డి కంపెనీ దరఖాస్తు చేసుకున్నప్పటికీ దానిని ఎపిఎండిసికి రిజర్వ్ చేసినట్లు నమ్మబలికి వారికి అనుకూలురైన వారికి ఇచ్చినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అందుకు సాక్ష్యాలు కూడా చూపించేందుకు మైనింగ్ యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది. పదుల ఎకరాల మైనింగ్ తమకు అనుకూలురైన వారికి వారు ధారాదత్తం చేశారని ఆరోపిస్తున్నారు.