ఐటి పత్రాలపై 28కి వాయిదా పడిన జగన్ కేసు

తమ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా సీబీఐ సేకరించిన వివరాలను ఐటీ శాఖకు ఇవ్వాలని సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశించడం సరికాదని జగన్ తన పిటిషన్లో అన్నారు. సివిల్ ప్రొసీజర్ కోడ్లోని నిబంధనల ప్రకారం ఒక కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన వివరాలను మరో శాఖకు ఇవ్వకూడదని, అలా ఇవ్వాలన్న నిబంధనలేవీ చట్టంలో లేవని అప్పీలు పిటిషన్లో అన్నారు.
ఐటీ శాఖ తమకు ఏం కావాలో స్పష్టంగా కోరకుండా మొత్తం అన్ని పత్రాలు ఇవ్వాలని కోరడం న్యాయసమ్మతం కాదని, ఐటీ శాఖకు కేవలం ఆదాయవ్యయాలకు సంబంధించిన పత్రాలు మాత్రమే అవసరమవుతాయని పిటిషన్లో అన్నారు. ఆదాయేతర పత్రాలతో ఆదాయపన్ను శాఖకు పనేముంటుంది, తనను ఇబ్బందులు పెట్టడానికే ఇదంతా చేస్తున్నారని పిటిషన్లో అన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా, తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.












Click it and Unblock the Notifications