రామోజీరావుకు ఏడేళ్ల జైలు శిక్ష పడాలి!: ఎంపీ ఉండవల్లి

రామోజీని ప్రాసిక్యూట్ చేయాలని తాను హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తానన్నారు. ఆయన కేసులో తన వాదన వినిపించేందుకు ఇంప్లీడ్ చేయాలని గతంలో సుప్రీం కోర్టును కోరానని ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించానన్నారు. రామోజీపై నాలుగు రిట్ పిటిషన్లు దాఖలు చేస్తానని చెప్పారు. చంద్రబాబు హయాంలో మార్గదర్శి షేర్ విపరీతంగా పెరిగిందని విమర్శించారు. కో ఆపరేటివ్ బ్యాంకులను మూసివేయించారని ఆరోపించారు. నాపై పరువు నష్టం దావా వేయాలని చూసి రామోజీ సెల్ఫ్ గోల్ చేసుకున్నారన్నారు.












Click it and Unblock the Notifications