జనవరి బాగుంది, ఈద్ అనలేదు: తెలంగాణపై చిదంబరం

chidambaram
న్యూఢిల్లీ: బక్రీద్ తర్వాత తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తామని తాను ఎప్పుడూ చెప్పలేదని కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం బుధవారం న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం అంశంపై కాంగ్రెసుతో సహా ముఖ్యమైన నాలుగు రాజకీయ పార్టీలు ఓ నిర్ణయానికి వస్తే డిసెంబరులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిసెంబరు చివరలోగా తెలంగాణపై పురోగతి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. నాలుగు పార్టీలు ఓ నిర్ణయానికి వస్తే డిసెంబర్ లేదా జనవరిలో అఖిలపక్ష సమావేశం ఉంటుందన్నారు. అఖిలపక్ష సమావేశానికి జనవరి నెలే బాగున్నట్టుందని ఆయన అన్నారు. కాగా గతంలోనూ జనవరిలో అఖిలపక్ష సమావేశం జరిగిన విషయం తెలిసిందే.

కిషన్‌జీది బూటకపు ఎన్‌కౌంటర్ కాదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ఆయుధాలు వీడితే 72 గంటల్లో చర్చలకు సిద్ధమన్నారు. హింసకు ఏ పరిస్థితుల్లోనూ కేంద్రం తలొగ్గదన్నారు. మావోయిస్టుల హింస ఇంకా కొనసాగుతోందని ఈ నెలలో వారి దాడిలో ముగ్గురు జవాన్లు, 27మంది పౌరులు మృత్యువాత పడ్డారన్నారు. ఎన్‌కౌంటర్లను కేంద్రం ప్రోత్సహించదన్నారు. రాజకీయ సమస్యల పరిష్కారానికి ఆయుధాలు పట్టడం సరికాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+